Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు చేసింది. అదేవిధంగా 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. పదో తరగతి ఫలితాలను బోర్డు తయారు చేయబోయే కొన్ని ప్రమాణాల ఆధారంగా సిద్ధం చేయనున్నట్లు కేంద్ర మానవమనరుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జూన్ 1న బోర్డు అప్పటి పరిస్థితులను సమీక్షించి 12వ తరగతి పరీక్షలను తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు. 12 తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 14 వరకూ జరగాల్సి ఉండగా.. ఇప్పుడవి వాయిదా పడ్డాయి. పరీక్షలు తిరిగి నిర్వహించే ముందు కనీసం 15 రోజులు ముందు నోటీసు ఇవ్వనున్నారు.