Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కరోనాతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. హనుమాన్ బస్తీకి చెందిన జలజ అనే మహిళ ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె భర్త మొండయ్యకు ఈనెల రెండో తేదీన కరోనా సోకింది. మొదట బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో చేరాడు. ఆరోగ్య పరిస్థితి విషమించటంతో హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. జలజ ఈనెల నాలుగో తేదీన కొవిడ్ బారిన పడ్డారు. అప్పట్నుంచి ఆమె హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. భర్తతో పాటు తనకూ కరోనా సోకిందన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మొండయ్యకు జలజ రెండో భార్య. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.