Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కోవిడ్ కేసులు ఉత్తరప్రదేశ్లో అంతకంతకూ తీవ్రమవుతుండటంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారంనాడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కోవిడ్ వాస్తవ పరిస్థితిని నాయకులతో కలిసి సమీక్షించారు. సుమారు రెండు గంటల సేపు ఈ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహిచారు. యూపీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల సంక్షేమానికి పాటుపడాల్సిన బాధ్యత మనపై ఉందని నాయకులకు ప్రియాంక దిశానిర్దేశం చేశారు.