Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో వికెట్ కోల్పోయింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. 33 పరుగులు చేసి అవుటయ్యాడు. హోల్డర్ వేసిన బంతిని పుల్ చేయబోయిన విరాట్.. స్కేర్ లెగ్ మీదుగా షాట్ ఆడాడు. అయితే బ్యాట్ ఎడ్జ్ తీసుకుని బంతి గాల్లోకి ఎగరడంతో డీప్ స్క్వేర్ లెగ్లో ఉన్న విజయ్ శంకర్ భారీ డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో కోహ్లీ పెవిలియన్కు చేరక తప్పలేదు. ప్రస్తుతం 12 ఓవర్లకు ఆర్సీబీ 3 వికెట్లకు 7.58 రన్రేట్తో 91 పరుగులు చేసింది. క్రీజులో గ్లెన్ మ్యాక్స్వెల్(27: 21 బంతుల్లో.. 2 ఫోర్లు, 2 సిక్స్లు), ఏబీ డివిలియర్స్(0) క్రీజులో ఉన్నారు.