Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 9 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. 3వ ఓవర్లో మహ్మద్ సిరాజ్ వేసిన ఓ బౌన్సర్ను భారీ షాట్ ఆడబోయిన సాహా.. డీప్ బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న మ్యాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వేగంగా వచ్చిన బంతిని మ్యక్స్వెల్ అద్భుతంగా అందుకోవడంతో ఆర్సీబీకి తొలి వికెట్ దక్కింది. ప్రస్తుతం సన్రైజర్స్ 2.1 ఓవర్లలో 13 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(7: 5 బంతుల్లో.. 1 ఫోర్), మనీష్ పాండే(0) క్రీజులో ఉన్నారు.