Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఒక్కరోజే 60 కరోనా కేసులు నమోదయ్యాయి. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 289 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 60 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి రవిరాజా తెలిపారు. తాజా కేసులతో కలిపి మండల వ్యాప్తంగా గత పది రోజులుగా 360 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇవాళ బీర్కూర్, నెమ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 266 మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వైద్యాధికారి ప్రజలకు సూచించారు.