Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముద్దనూరు : కడప జిల్లా ముద్దనూరు మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం బైకు, బొలేరో వాహనం ఢీకొనడంతో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు.. ముద్దనూరు మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన రవితేజ(22), చంద్రశేఖర్రెడ్డి(26), శివశంకర్(23) బైకుపై ముద్దనూరుకు బయలుదేరారు. కడప ప్రకాశ్ నగర్కు చెందిన డ్రైవర్ అమర్నాథరెడ్డి, శివరామిరెడ్డి కొండాపురం మండలం బెంజితిమ్మాపురం గ్రామంలో జ్యోతుల ఉత్సవానికి వెళ్లి బొలేరో వాహనంలో కడపకు తిరగి వస్తున్నారు.
కడప-తాడిపత్రి రోడ్డులో ఉన్న తిమ్మాపురం గ్రామ పంచాయతీలోని పెంట్రోల్ బంకు వద్దకు రాగానే బైకు, బొలేరో ఢీకొన్నాయి. దీంతో బైకుపై వస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. శివరామిరెడ్డికి స్వల్ప గాయాలవగా ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సీఐ హరినాథ్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించారు.