Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నకరికల్లు : గుంటూరు జిల్లాలో ఓ కౌలు రైతు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన కాశిమళ్ల బిక్షం(65) రెండేళ్లుగా రెండెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో రూ.లక్షల్లో అప్పులు చేశారు. అప్పులు తీర్చే మార్గం లేక కొన్ని రోజులుగా మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం పొలానికి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు ఏఎ్సఐ ప్రసాదరావు కేసు నమోదు చేశారు.