Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కూకట్పల్లి: ప్రముఖ రంగస్థల నటుడు, యువకళావాహిని వ్యవస్థాపకులు, సాంస్కృతిక దిగ్గజం వై.కె.నాగేశ్వరరావు కూకట్పల్లిలో బుధవారం గుండెపోటుతో మరణించారు. మూడురోజులుగా దగ్గు, తీవ్ర జలుబుతో బాధపడుతూ కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. సాయంత్రం ఒక్కసారిగా పల్స్ పడిపోవడంతో గుండెపోటుతో మృతి చెందారు. మృతదేహాన్ని కూకట్పల్లి జయానగర్లోని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. నాగేశ్వరరావు మృతి సాంస్కృతిక రంగానికి తీరని లోటని పలువురు బాధను వ్యక్తం చేశారు.