Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగుళూరు : హైస్కూల్ లో చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి మరో బెంగుళూరుకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడిన కిరాతకుడిని భట్కళ పోలీసులు అరెస్ట్ చేశారు. భట్కళ తాలూకా చిత్రాపుర ఒడ్డుకుళికి చెందిన అక్షయ మంజునాథ నాయక్(23) రెండు రోజుల క్రితం హైస్కూల్లో చదువుతున్న బాలికను బెంగళూరుకు తీసుకొచ్చి లైంగికదాడి చేశాడు. బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక బెంగళూరులో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు నగరానికి వచ్చి గాలింపు చేపట్టి నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.