Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్ : కొందరు దొంగలు మితిమీరిపోయారు. ఏకంగా ఓ ఆస్పత్రి నుంచి 320 డోసుల కొవిడ్ వ్యాక్సిన్ను దొంగిలించారు. రాజస్థాన్లోని జరిగిన ఈ ఘటన.. అందరినీ షాక్కు గురిచేసింది. జైపూర్లోని శాస్త్రి నగర్లో ఉండే కాన్వాటియా ఆస్పత్రిలో 320 డోసుల కొవిడ్ వ్యాక్సిన్ కనిపించకుండా పోయాయి. హాస్పిటల్ మొత్తం గాలించినా అవి దొరక్క పోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాక్సిన్లు సరిపడా అందుబాటులో లేక రాష్ట్రం ఇబ్బందులు పడుతున్న వేళ.. ఈ ఘటన జరగడంపై ఆరోగ్యశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.