Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గాలి ద్వారా కరోనా వేగంగా విస్తరిస్తోందని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి తెలంగాణలోనూ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలని శ్రీనివాసరావు చెబుతున్నారు. తెలంగాణలో నాలుగు వారాలుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరో ఆరు వారాలు ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు. ప్రజలు సహకరించకపోతే తెలంగాణ కూడా మరో మహారాష్ట్రగా మారే ప్రమాదం ఉందని ఆయన భయాందోళనలు వ్యక్తం చేశారు.