Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భార్య కాపురానికి రావట్లేదని మనస్తాపం చెందిన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిలింనగర్ బీజేఆర్నగర్కు చెందిన ఎస్.లింగమ్మకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ పెళ్లిల్లు అయ్యాయి. చిన్న కొడుకు విశ్వనాథ్కు వికారాబాద్ నవాబ్పేటకు చెందిన భూదేవితో పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. అదే బస్తీలో కాపురం పెట్టారు. దంపతుల మధ్య నిత్యం గొడవ జరిగేది. 2018 ఆగస్టులో భూదేవి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రావాలని విశ్వనాథ్ ఎన్నిసార్లు బతిమాలినా ఆమె ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఈనెల 13న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. శవాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.