Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో వివాహితపై లైంగికదాడి, హత్య చేసిన నిందితులకు ఉరి శిక్ష పడేలా చేయాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్ అన్నారు. నల్లగొండ జిల్లాలోఇటీవల ఓ వివాహితపై ఇద్దరు నిందితులు లైంగికదాడికి పాల్పడి అనంతరం హత్య చేసిన సంగతి తెలిసిందే. దాంతో మృతురాలి కుటుంబాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. వారికి రూ. లక్ష ఆర్థిక సాయంగా అందజేశారు. పార్టీ తరఫున మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం ఎంపీ మాట్లాడుతూ వివాహితపై లైంగికదాడి, హత్య భాధాకరమన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఉరిశిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. భాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు
అలాగే రాష్ట్రంలో మద్యం, గంజాయి, డ్రగ్స్ విపరీతంగా చలామణీ అవుతున్నాయని.. వాటిని ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేశారు.