Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతీయ జనకంటక పార్టీగా బీజేపీ మారిందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని మోడీ మాట తప్పాడని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నదన్నారు. మోడీ పాలనకు వ్యతిరేకంగా బిలియన్ మార్చ్ చేయాలని చెప్పారు. ఇక రఘునందన్రావు మేధావిలా ఫీలవుతున్నాడని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు తప్పుడు మాటలు చెప్పడం మానుకోవాలని సూచించారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో రూ.200 పింఛన్ ఇస్తే, తెలంగాణలో రూ.2 వేలు ఇస్తున్నామని చెప్పారు. అలాగే సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.