Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర చట్టం చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను నిలిపివేయాలని, ఉపాధీ హామీ కూలీ వేతనం రోజుకు 600 రూపాయలకు పెంచాలని, పెట్రో, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం దేశ వ్యాప్త బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్కు విస్తృతంగా వివిధ తరగతుల ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి మద్దతు వస్తోంది. బంద్కు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతునిచ్చాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఇంకా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా బంద్కు సంఘీభావం ప్రకటించాయి.
ఇక తెలంగాణలో టీఆర్ఎస్ బంద్ పై స్పందించలేదు. అయితే బంద్కు కాంగ్రెస్, సీపీఐ(ఎం), టీడీపీ, సీపీఐ, ఇతర వామపక్షాలు బంద్ ను విజయవంతం చేయడానికి నడుం బిగించాయి. ఇకఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం స్వచ్ఛందంగా మద్యాహ్నం ఒంటిగంట వరకు ఆర్టీసి బస్సులను నిలిపివేసింది. గత పక్షం రోజుల నుంచి వామపక్షాలు బంద్ జయప్రదానికై దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహనను కల్పించారు.