Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్ : మూగ బాలికపై సామూహిల లైంగికదాడి చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని భిల్వాడాలో రెండు నెలల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకెళ్తే. సోమవారం బాధిత మూగ బాలికకు తీవ్ర కడుపునొప్పి వచ్చి రక్తస్రావం కూడా అయింది. వెంటనే ఆమె సోదరి.. స్థానికంగా ఉండే మహాత్మాగాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించగా.. బాలిక గర్భవతి అని తేలింది. దాంతో వారు పోలీసులకు, అధికారులకు సమాచారం ఇచ్చారు. దాని గురించి బాలికను అడగగా ఆమె ఏదో చెబుతోంది కానీ అది అధికారులకు అర్థం కాలేదు. దాంతో మూగ భాషను అర్థం చేసుకొనే నిపుణులను పిలిపించగా.. అసలు విషయం తెలిసింది. రెండు నెలల క్రితం వ్యవసాయ పనులు చేస్తుండగా తనపై ముగ్గురు సామూహిక లైంగికదాడికి పాల్పడినట్టు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.