Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాలలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలల్లోని ధాన్యం తినేశాయని రైతులు ఆరోపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి ఇచ్ఛాపురం మండలంలోని శివారు గ్రామమైన ముచ్చింద్ర గ్రామ పంటపొలాల్లో ఏనుగులు వచ్చి సుమారు 100 బస్తాల ధాన్యాన్ని తినేశాయి. సుమారు లక్ష పంట నష్టపోయినట్టు తెలుస్తోంది.