Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణలో భౌతికదూరం నిబంధన అమలు కాకపోవడం దురదృష్టకరమని రాష్ర్ట హైకోర్టు పేర్కొంది. తెలంగాణలో కరోనా పరిస్థితి, ప్రభుత్వ చర్యలపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ మేరకు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు.. కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి డీహెచ్ శ్రీనివాస రావు కోర్టుకు నివేదిక సమర్పించారు. అయితే ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తోందని పిటిషనర్లు ఆరోపించారు. 3 రోజుల్లోనే 1.70 లక్షల జ్వర బాధితులను గుర్తించారని, రాష్ర్టంలో కరోనా తీవ్రతకు ఇదే నిదర్శనమని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. అలాగే ప్రభుత్వం ఇస్తున్న కరోనా కిట్లో పిల్లలకు అవసరమైన మందులు లేవని చెప్పారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వం ఎప్పటికప్పు సమీక్ష నిర్వహించి.. చర్యలు తీసుకుంటోందని ఏజీ హైకోర్టుకు తెలిపారు. అయితే భౌతికదూరం పాటించడం అమలు కాకపోవడం దురదృష్టకరమని హైకోర్టు పేర్కొంది. కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను జీహెచ్ఎంసీ, పోలీసులు కఠినంగా అమలు చేయాలని చెప్పింది. . రాష్ర్టంలో పరిస్థితి వివరించేందుకు తదుపరి విచారణకు డీహెచ్ హాజరు కావాలని ఆదేశించింది. కరోనా పరిస్థితిపై విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
అంతకు ముందు హైకోర్టుకు డీహెచ్ శ్రీనివాసరావు సమర్పించిన నివేదికలో పలు వివరాలనె తెలిపారు. రాష్ర్టంలో అంత కరోనా తీవ్రత లేదని.. రాత్రి కర్ఫ్యూ అవసరం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని తెలిపారు. పాజిటివిటీ 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ అవసరమన్నారు. ఇంటింటి జ్వరం సర్వే కొనసాగుతోందని.. మూడు రోజుల్లోనే లక్షణాలున్న లక్షా 78 వేలమందికి కిట్లు పంపిణీ చేశామని వెల్లడించారు.