Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఐదు రాష్ర్టాలు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. అలాగే రిపబ్లిక్ డే నాడు తాను తన రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను.. జై హింద్ అంటూ ఆర్పీఎన్ సింగ్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఆర్పీఎన్ సింగ్ 1996 నుంచి 2007 వరకూ పడ్రౌనా ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతరం కుషీనగర్ నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్రంలో హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అయితే 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు.