Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ డిచ్ పల్లి
వివాహానికి ముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి క్షీరాభిషేకం, పాలాభిషేకం చేసి అనంతరం పెండ్లీ పీట ఎక్కి ఓ జంట అందరికీ ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకెళ్తే.. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామానికి చెందిన సూర కాంతారావు-శాంత కొడుకు సూర సతీష్-శ్రీలత ల వివాహం శనివారం జరిగింది. అయితే వారు పెండ్లికి ముందు డప్పు వాయిద్యాలతో గ్రామం నడిబొడ్డున ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం, పాలాభిషేకం చేసి పూల దండను వేసి అంబేద్కర్ అశీర్వాదం తీసుకున్నారు. తాము ఇలా గర్వంగా పది మంది లో తిరిగే స్వేచ్ఛను బాబాసాహెబ్ ఇచ్చారని తెలిపారు. తర్వాత పెండ్లి పీటల మీద కూర్చున్నారు. దీనిని చూసిన బర్దిపూర్ గ్రామస్తులు ఈ దంపతులు కనివిని ఎరుగని రితిలో చేసిన ఒక మంచి శుభ కార్యమని కొనియాడారు. వారికి ప్రతీ ఒక్కరు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నూతన జంట ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రాజ్యంగ్యం పై విమర్శలు చేసే వారు ఈ ఆదర్శ దంపతులను చుసి నేర్చుకోవాల్సింది చాలానే ఉన్నాయన్నారు.