Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా శామీర్పేట పరిధిలో విషాదం చోటు చేసుకుంది. తన తండ్రి దశదినకర్మ నిర్వహించేందుకు డబ్బుల్లేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శామీర్పేట సీఐ సుధీర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మూడుచింతపల్లి మండలం అద్రాస్పల్లి గ్రామానికి చెందిన నర్సింహ(30) తండ్రి యాదయ్య వారం కిందట మృతి చెందాడు. ఆయన దశదినకర్మను ఆదివారం(రేపు) నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమం నిర్వహించేందుకు డబ్బు లేకపోవడంతో నర్సింహ తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న శామీర్పేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.