హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెండు, మూడు రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో అరేబియన్ సముద్రం, లక్షద్వీప్లోని పలు ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోకి జూన్ 5 నుంచి 10వ తేదీ మధ్యలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.