Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాంపూర్ : లైంగికదాడికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రాంపుర్ జిల్లా సైఫ్నీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్ది రోజుల క్రితం 17 ఏండ్ల బాలుడు.. 15 ఏండ్ల బాలిక ఇంటికి వచ్చి ఆమెపై లైంగికదాడి చేశారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెను పెండ్లి చేసుకోవాలని అబ్బాయిని అడిగారు. అయితే అతని తల్లిదండ్రులు అతను మైనర్ అని చెప్పి ప్రతిపాదనను తిరస్కరించారు. దాంతో బాలిక ఆత్మహత్య చేసుకుందని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడిని అరెస్టు చేశారు.