Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై : ఒమిక్రాన్ సబ్ వేరియంట్లైన బీఏ.4, బీఏ.5 కరోనా కేసులు దేశంలో పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పూణేకు చెందిన నలుగురిలో బీఏ.4, ముగ్గురిలో బీఏ.5 వేరియంట్ ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పూణే జిల్లా వైద్యాధికారులకు సూచించింది.
ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.4 తొలి కేసును ఈ నెల ఆరంభంలో హైదరాబాద్లో గుర్తించారు. అనంతరం తెలంగాణతోపాటు తమిళనాడులో బీఏ.4, బీఏ.5 వేరియంట్ కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ఈ ఒమిక్రాన్ వేరియంట్ల కరోనా వైరస్ వల్ల పెద్దగా ముప్పులేదని వైద్య నిఫుణులు తెలిపారు.