Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్ వ్యతిరేకంగా ఓటు వేసి కాళ్లు మొక్కారు..
అయన హయాంలో అందరు సమానులే.
ముఖ్యమంత్రి కేసీఆర్, బిజెపి, కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వచ్చిన వారే
మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు
నవతెలంగాణ డిచ్ పల్లి
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో, రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు స్పూర్తినిచ్చిన నందమూరి తారకరామారావు లాంటి వ్యక్తి సాన్నిహిత్యంలో 40 ఏండ్లు రాజకీయం చేశానని కానీ అతనికి ఎదురెళ్లిన రోజే తన జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజని మండవ వెంకటేశ్వర్ రావు అన్నారు. శనివారం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు తన సొంత గ్రామం డిచ్ పల్లి మండలంలోని ధర్మారం(బి)లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నాడు ఉన్న రాజకీయ వాతావరణంలో అనాటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని రాజ్ భవన్ కు వెళ్లినప్పటికీ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా నిలబడడం తనను కలిచివేసిందన్నారు. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఓట్లు వేసేందుకు వచ్చిన వారు ఆయన కాళ్లను మొక్కి కన్నీటి పర్యంతమయ్యారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తిత్వం గల వారు ఉండబట్టే నేటికి తెలుగుదేశం మూలాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆనాడు పాటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు చేసి దేశంలోనే చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బిజెపి లో రాష్ట్ర, జాతీయా నాయకులతోపాటు ఎందరో నాయకులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లు తెలుగుదేశం ప్రొడెక్ట్ లేనని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులకు ఎన్టీఆరే నేటికి స్పూర్తి అన్నారు. ఎన్టీఆర్ ఏ ఒక్క కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించలేదని, అన్ని కులాలు మతాల వారికి అందరి వారుగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తన్నరు.
తన జివితంలో సహజ నటుడిగా తర్వాత రాజకీయ వేత్తగా, ముఖ్యమంత్రిగా అన్ని సామాజిక వర్గాలను చేరదీసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కోనియాడారు.అయన హయాంలో తెలుగు మాట్లాడే వారు అందరు తనవారని అనుకుని దేశ రాజకీయాల్లో ఆదర్శ ప్రాయుడుగా నిలిచారని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మాగాంధీ, పెరియార్ లాంటి మహామహులకే ఒడిదొడుకులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో తారతమ్యాలు ఉండక్కర్లేదని, అవినీతి, అక్రమాల విషయంలో సామాన్యుడి నుండి మొదలుకోని ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీయాలని ఇచ్చిన స్పూర్తి ఎన్టీఆర్ దేనన్నారు. ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తిత్వం గల వారు ఉండబట్టే నేటికి తెలుగుదేశం మూలాలు ఉన్నాయని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు,
సర్పంచ్ పత్తి మమతా ఆనంద్, మాజీ ఉప సర్పంచ్ సోమనాథ్, రామకృష్ణ, నాగేశ్వరరావు, సాయిబాబా, నాగేశ్వరరావు తోపాటు తదితరులు పాల్గొన్నారు.