Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జూన్ 2న తెలంగాణా రాష్ట్ర అవతరణ వేడుకలను హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా అమర వీరుల స్తూపం వద్దకు చేరుకొని తెలంగాణ అమరులకు నివాళులు అర్పిస్తారని తెలిపారు. అనంతరం పబ్లిక్ గార్డెన్ కు చేరుకొని జాతీయ పతాకావిష్కరణ చేస్తారని అన్నారు. తర్వాత సీఎం.. పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారని.. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుందని తెలిపారు. అదేరోజు సాయంత్రం 30 మంది ప్రముఖ కవులచే కవిసమ్మేళనం రవీంద్ర భారతి లో నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని, సంబంధిత అధికారులను ఆదేశించారు. అవతరణ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి,ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు,జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.