Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్కు చెందిన హైదరాబాద్ సర్కిల్ మీటింగ్ ఇవాళ హన్మకొండలో జరిగింది. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో జనరల్ బాడీ మీటింగ్ను గ్రాండ్గా నిర్వహించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి జీబీఎం సమావేశాలను నిర్వహిస్తారు. అయితే ఇది 25వ జనరల్ బాడీ సమావేశం కావడంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు ఈ సభకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. గడిచిన మూడు సంత్సరాల పాటు జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను యూనియన్ నేతలు వెల్లడించారు. దేశం నలుమూలల నుండి ఎస్బీఐ యూనియన్ లీడర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సభను ఒక ఉత్సవంలా ఎస్బీఐ నిర్వహిస్తోంది.