Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కొన్ని నెలల కిందట అదృశ్యమైన భార్య ఆచూకీని పోలీసులు కన్నుక్కోకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బీఎస్పీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు తన ఇద్దరు కూతుర్లతో కలిసి హెచ్చరించాడు. అందుకు సంబంధించి వారు రికార్డు చేసిన ఓ వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
వివరాల్లోకెళ్తే.. బీఎస్పీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సత్యం భార్య అన్నపూర్ణ కొన్ని నెలల కిందట అదృశ్యమైంది. ఈ మేరకు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటివరకు ఆమె ఆచూకి తెలియకపోవడంతో భర్త, వారి ఇద్దరి కూతుర్లు ఆవేదన చెందారు. ఈ మేరకు ఒక వీడియో రికార్డు చేశారు. అందులో.. పిల్లలు మాట్లాడుతూ.. ఇన్ని రోజులు బతికున్నామంటే.. తమ తల్లి వస్తుందన్న నమ్మకంతోనేని అన్నారు. ప్రభుత్వం, పోలీసులు దృష్టి సారించి తమ తల్లి ఆచూకీ కనిపెట్టాలని వేడుకున్నారు. సత్యం మాట్లాడుతూ.. తన భార్య అదృశ్యం కేసు వెనక పెద్దవాళ్ల హస్తం ఉందని అనిపిస్తోందని చెప్పారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని.. వాటన్నింటిని పోలీసులకు ఇవ్వనున్నట్టు తెలిపారు. 48 గంటల్లో తన భార్య ఆచూకీ చెప్పకపోతే తన ఇద్దరు కూతుళ్లతో కలిసి తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తమ మృతదేహాలకు సంబంధించిన లొకేషన్ ను సోషల్ మీడియాలో తెలియజేస్తానని పేర్కొన్నారు. అనంతరం సత్యం తన ఇద్దరు కూతుళ్లతో పాటు అదృశ్యమయ్యారు. తాండూర్ లోని తన నివాసానికి తాళం వేసి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.ఇప్పుడు ఈ ఘటన సంచలనంగా మారింది.