Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ప్రొబేషన్ పూర్తి అయిన వారికి జీత భత్యాలను కూడా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేండ్ల సర్వీసు పూర్తి చేసుకుని పరీక్ష ఉత్తీర్ణులైన వారందరికీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సచివాలయ
అలాగే ఉద్యోగులకు పే స్కేల్ను ఖరారు చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీల పే స్కేల్ను రూ.23,120 నుంచి రూ.74,770కు, ఇతర సచివాలయ ఉద్యోగుల పే స్కేల్ను రూ.22,460 నుంచి రూ.72,810 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.