Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై : మహారాష్ర్టలో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ పై రెబల్ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానాన్ని పంపగా అది తిరస్కరణకు గురైంది. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ పై అవిశ్వాస తీర్మానాన్ని మెయిల్ చేశారని పేర్కొన్నాయి. అయితే 34 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానంపై సంతకం చేసినా.. ప్రత్యక్షంగా ఎవరూ దానిని డిప్యూటీ స్పీకర్ కార్యాలయంలో సమర్పించలేదన్నారు. కేవలం జూన్ 22 న ఉదయం 11:30 గంటలకు ఒక అనామక ఈ మెయిల్ ఐడీ నుంచి మెయిల్ మాత్రమే పంపారని తెలిపారు. ఈ మెయిల్ సాధికారతను నిరూపించలేకపోవడంతో ఆ తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించినట్టు పేర్కొన్నారు. తీర్మానంపై సంతకం చేసిన ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా వచ్చి సమర్పించే వరకు.. ఆ తీర్మానం సాధికారతను నిర్ధారించుకునే వరకు.. దానిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని డిప్యూటీ స్పీకర్ నిర్ణయించినట్టు తెలిపాయి.