Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలో ఓ వాట్సాప్ గ్రూపులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనుచిత కామెంట్ పెట్టిన వ్యక్తిని పోలీసులు తీవ్రంగా కొట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. వివరాల్లోకెళ్తే.. ఓ వాట్సాప్ గ్రూపులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇతర నాయకులు భోజనం చేస్తున్న ఫోటోకు పవన్ కుమార్ అనే యువకుడు అనుచిత కామెంట్ జత చేశాడు. దాంతో అతనిపై టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేసుకున్న చొప్పదండి పోలీసులు పవన్ ను అదుపులోకి తీసుకున్నారు. తనను పోలీసులు లాఠీలతో తీవ్రంగా కొట్టినట్టు పవన్ ఆరోపిస్తున్నాడు. ఆ దెబ్బలకు తాను నడవలేకపోతున్నానని బాధితుడు వాపోయాడు. అలాగే బాధిత యువకుడు జిల్లా పోలీస్ కమిషనర్ సత్యనారాయణను ఆశ్రయించగా స్పందించిన కమిషనర్ రూరల్ ఏసిపి కరుణాకర్ ను విచారణకు ఆదేశించారు. వెంటనే విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని, బాధ్యులు ఎవరైనా కూడా ఉపేక్షించేది లేదని పోలీస్ కమిషనర్ తెలిపారు. మరోవైపు ఆ వ్యక్తి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు వాట్సాప్ లో చేసినట్టు ఒప్పుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.