Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కర్నాటక రాష్ట్రంలోని కాల బురగీ వద్ద ఈ నెల 3న జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ఇప్పటకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఆర్ధిక సహాయాన్ని మంజూరు చేసింది. ఈ నెల 27న ఉదయం 11.00 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్ లో బాధిత కుటుంబాల సభ్యులకు ఆర్ధిక సాయం చెక్కులను అందజేస్తారు.
బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి.మృతులకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు.