Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దంబుల్లా: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ మహిళ జట్టు గెలుపొందింది. దాంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్ 2-0తో ట్రోఫీని కైవసం చేసుకుంది.
126 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పొయి చేధించింది.
భారత ఓపెనర్లు స్మృతిమందన 39, హర్మన్ప్రీత్ కౌర్ 31, షఫాలీ వర్మ 17, సబ్బినేని మేఘన 17, జెమిమా రోడ్రిగ్స్ 3, యాస్తిక భాటియా 13, దీప్తి శర్మ 5 పరుగులు చేశారు. శ్రీలంక బౌలింగ్లో రణసింఘే 2 , ఇనోకా రణవీర 2, సుగంధిక కమారి 1 వికెట్ తీశారు.
తోలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకోగా శుభారంభమే లభించింది. ఓపెనర్లు విష్మి గుణరత్నె -కెప్టెన్ చమరి అటపట్టుతో కలిసి తొలి వికెట్కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. విష్మి 50 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు చేయగా, చమరి అటపట్టు 41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్తో 43 పరుగులు చేసింది. వీరిద్దరూ అవుటయ్యాక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. మాధవి (9), కవిష దిల్హరి (2), నీలాక్షి డి సిల్వ (1), హాసిని పెరీరా (0), రణసింఘే (5), అనుష్క (8, నాటౌట్), సుగంధిక కమారి (1, నాటౌట్) క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. దాంతో 20 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక ఏడు వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీసుకోగా, రేణుక సింగ్, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, హర్మన్ప్రీత్ కౌర్ చెరో వికెట్ తీసుకున్నారు. రెండు జట్ల మధ్య మూడో టీ20 సోమవారం జరగనుంది.