Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో భూముల విక్రయానికి ఏపీసీఆర్డీఏ ప్రణాళికలు రూపొందించింది. తొలివిడతలో 248.34 ఎకరాలను విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎకరాకు రూ. 10 కోట్ల చొప్పున రూ. 2480 కోట్లు సేకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం ఏపీ ప్రభుత్వం 389 జోవో జారీ చేసింది.
రాజధాని పరిధిలో గతంలో బీఆర్ శెట్టి మెడిసిటీకి కేటాయించిన 100 ఎకరాలతో పాటు లండన్ కింగ్స్ కాలేజీకి కేటాయించిన 148 ఎకరాలను తొలి విడతలో విక్రయించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. వచ్చే నెలలో భూములను వేలం ద్వారా విక్రయించనున్నారని తెలిసింది. రాజధాని అభివృద్ధికి బ్యాంకుల నుంచి రుణాలు లభించని నేపథ్యంలో సొంతంగానే నిధులు సమకూర్చుకోవాలనుకుంటున్నట్లు సీఆర్డీఏ ప్రభుత్వానికి తెలిపింది. భూముల విక్రయం ద్వారా అందే నిధులను రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు సీఆర్డీఏ చెప్పింది.