Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : ఏపీలోని కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థిని 11మంది సీనియర్లు ర్యాగింగ్ చేసినట్టు తెలిసింది. యూసీజీ యాంటీ ర్యాగింగ్ వెబ్ సైట్ లో బాధిత విద్యార్థి స్నేహితుడు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై యూనివర్సిటీ యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ జరిపింది. ర్యాగింగ్ చేసింది నిజమేనని తెలియడంతో మొత్తం 11 మంది విద్యార్ధులను రెండు నెలల పాటు హస్టల్ నుండి, 15 రోజుల పాటు క్లాస్ ల నుండి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయినవారిలో ఇద్దరు సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉండగా.. మరో తొమ్మిది మంది థర్డ్ ఇయర్ విద్యార్ధులు ఉన్నారు.