Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దక్షిణ భారత దేశంలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థగా కొనసాగుతున్న మంత్రి డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్- సీఈవో సుశీల్ మంత్రిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఆయన మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అధికార వర్గాలు తెలిపాయి. బెంగళూ రులో ఇండ్ల కొనుగోలుదారుల నుంచి సేకరించిన సొమ్మును ఆయా ప్రాజెక్టులపై ఖర్చు చేయకుండా సుశీల్ మంత్రి సొంత అవసరాలకు వాడుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలింది.
పీఎంఎల్ఏ సెక్షన్ల కింద నమోదు చేసిన ఈ కేసులో కోర్టు అనుమతితో ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. అనంతరం కోర్టులో సుశీల్ను హాజరుపరచి తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోరారు. అందుకు కోర్టు.. సుశీల్ను 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.