Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. గాంధారి మండలంలో పశువులను మేపడానికి వెళ్లిన ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం మహిళ చనిపోయిందని భావించి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్పృహలోకి వచ్చిన మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఓ యువకుడు, ఓ బాలుడు ఉన్నట్టు గుర్తించారు.