Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతీ ఏటా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని కాసేపటి క్రితం రాష్ర్ట విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. నిలిపివేత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని విద్యాశాఖ కార్యదర్శిని మంత్రి ఆదేశించారు.
కొందరు ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతోపాటు, ఇతర మార్గాల్లో ఆదాయం పొందుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో టీచర్ల ఆస్తులు ప్రతీ ఏటా ప్రకటించాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం ఆ ఆదేశాలను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.