Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నూతనంగా నియమితులైన ఆరుగురు హైకోర్టు న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10.45 గంటలకు మొదటి కోర్టు హాల్లో వీరి చేత చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణం చేయిస్తారు. ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేశ్ భీమపాక, పుల్ల కార్తీక్, కాజ శరత్ శాశ్వత న్యాయమూర్తులుగా.. జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్రావు అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.