Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వంశధారకు భారీగా వరద నీరు పోటెత్తింది. నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఒడిసాలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు చేరుతోంది. దీంతో వంశధార అధికారులు అప్రమత్తమయ్యారు. గొట్టా బ్యారేజీ వద్ద 22 గేట్లను పూర్తిగా పైకెత్తి కిందకు నీటిని విడిచిపెడుతున్నారు. సోమవారం ఉదయం నుంచి నదిలోకి ఇన్ఫ్లో గణనీయంగా పెరిగింది. ఉదయం 9 గంటలకు రికార్డు స్థాయిలో 85,402 క్యూసెక్కుల నీటిని గొట్టా బ్యారేజీ వద్దకు కిందకు విడిచిపెట్టారు. 10 గంటలకు 82,575 క్యూసెక్కులు ఉండగా సోమవారం రాత్రి వరకూ అదే స్థాయిలో వరద కొనసాగింది. దీంతో నదీ తీరానికి ఇరువైపులా పంట పొలాలు ముంపునకు గురయ్యాయి.