Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ జిల్లాలో 39 మంది భద్రతా సిబ్బందితో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు రోడ్డుపై నుంచి జారిపడి నదీగర్భంలో పడిపోవడంతో ఏడుగురు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది మరణించారు. అలాగే 30 మంది గాయపడ్డారు. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎనిమిది మంది సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం శ్రీనగర్లో చికిత్స పొందుతున్నారని వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. పోలీసు సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డానని.. తన ప్రార్థనలు, ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయని ట్వీట్ చేశారు. క్షతగాత్రులను త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు. అలాగే మృతులకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా సంతాపం తెలిపారు. 'జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఐటీబీపీ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిన వార్త చాలా బాధాకరం. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని, అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను` అని ఆయన ట్వీట్ చేశారు.