Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హైదరాబాద్ లోని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఓ కారు కలకలం రేపింది. కారులో బాంబ్ ఉందంటూ కంట్రోల్ రూమ్కి ఫోన్ కాల్ రాగా.. పోలీసులు తనిఖీ చేయగా అందులో బాంబు లేదని తేలింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. బీజేపీ రాష్ట్ర కార్యాలయం పక్కన నానో కారు రెండు రోజులుగా పార్కింగ్ చేసి ఉంది. బీజేపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి వెంటనే అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. వారు జాగిలం, బాంబు నిర్వీర్య దళంతో అక్కడకు చేరుకుని కారును పరిశీలించారు. అందులో ఉన్న సూట్ కేసును తనిఖీ చేయగా అందులో దుస్తులు బయటపడ్డాడయి. కారు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్నట్టు వివరించారు. కారు యజమాని ఫైజాన్గా పోలీసులు గుర్తించిన పోలీసులు అతన్ని విచారించారు. ఇంటి వద్ద స్థలం లేకపోవడంతోపార్టీ కార్యాలయం వద్ద కారును పార్క్ చేసినట్టు పోలీసులకు యజమాని తెలిపారు.