Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టుకు వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు షాక్ తగిలింది. భారత జట్టు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఎడమ చేతి భుజానికి గాయం కావడంతో సుందర్ ఈ పర్యటన నుంచి వైదొలిగినట్టు బీసీసీఐ తెలిపింది.
ఇదిలా ఉండగా సుందర్ స్థానంలో 27 ఏండ్ల షాబాజ్ అహ్మద్ను ఎంపిక చేశారు. ఇంగ్లండ్లో కౌంటీ గేమ్ ఆడుతున్న సమయంలో సుందర్ గాయపడ్డాడు. ఐపీఎల్ 2022లో ఆర్సీబీ తరపున షాబాద్ అద్భుతంగా రాణించాడు.