Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వికారాబాద్ : బీజేపీపై సీఎం కేసీఆర్ మరో సారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ను మంగళవారం ప్రారంభించిన కేసీఆర్ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. వచ్చిన తెలంగాణను మళ్లీ గుంటనక్కలు వచ్చి పీక్కొని తినకుండా, పాత పద్దతికి మళ్లీ పోకుండా, మళ్లీ పరిస్థితులు దిగజారకుండా, వారి రాజకీయ స్వార్థాలకు బలికాకుండా ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ జెండాను చూసి మోసపోతే కరెంట్ బావుల కాడ మీటర్లు పెట్టి.. శఠగోపం పెట్టి, పెద్ద షావుకార్ల కడుపులు నింపుతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మేలు చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఉచితాలు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు.
కొంతమంది చిల్లరమల్లరగాళ్లు జెండాలు పట్టుకుని తన బస్సుకు అడ్డం వచ్చారని.. ఆ ఐదారు మంది పోరగాళ్లను మనోల్లు కొడితే తుప్పుతుప్పు అవుతారని చెప్పారు. 8 ఏండ్ల నుంచి బీజేపీ ఒక్క మంచి పని చేసిందా? అని ప్రశ్నించారు. దీనిపై మీరందరూ చర్చ పెట్టాలన్నారు.