Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ డిచ్ పల్లి
గత కొన్నేండ్లుగా తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు నిరంతరం పోరాటం చేస్తున్నా కూడా వీసీ స్పందించడం లేదని మంగళవారం విద్యార్థుల ఆధ్వర్యంలో యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ లను లోనికి వెళ్ళకుండా అడ్డుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రధానంగా యూనివర్సిటీ లో అనేక సమస్యలు ఉన్నా.. వీటన్నింటినీ గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఈ వైస్ ఛాన్సలర్ వద్దే వద్దని నినాదాలు చేశారు.
బాలికలకు నూతన వసతి గృహ నిర్మాణం, నూతన ఆడిటోరియం నిర్మాణం, యూనివర్సిటీ లో బోధనా నియామకాలు, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను పెంచాలని, యూనివర్శిటీ లోని హెల్త్ సెంటర్లో ఎంబీబీఎస్ డాక్టర్ నియమించాలని, యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం 7 గ్రాడ్యుయేషన్ డే ను నిర్వహించాలని, కనీస మౌలిక వసతులు కల్పించాలని, యూనివర్సిటీలో నూతన కోర్సులను ప్రారంభించాలని,నిధుల దుర్వినియోగం పై విచారణ జరిపించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ లు వారం లో ఒకసారి హాస్టల్స్ లో బోజనం చెయ్యాలని అన్నారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనడంతో పోలిసులు యూనివర్సిటీకి చేరుకున్నారు. విద్యార్థుల డిమాండ్ లకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని వైస్ ఛాన్సలర్ హామీ ఇచ్చారు.