Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బీసీల్లో రాజకీయ చైతన్యం పెరగాలని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ఆర్థిక వెనుకబాటు తనంతోనే రాజకీయా లకు దూరంగా ఉండాల్సి వస్తుందని చెప్పారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో సుమారు 20 రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రు లయ్యారని, కానీ 71 ఏండ్ల స్వాతంత్య్రంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క బీసీ కూడా బీసీ కాలేకపోయారని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో, ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో డబ్బుల పంపిణీతోనే ఎన్నికలు ముడిపడి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల సంక్షేమం కోసం ఇప్పటి వరకు తమ సంఘం 10వేల ఉద్యమాలను చేపట్టిందన్నారు. దానివల్ల ఎంతోకొంత బీసీలకు మేలు జరిగింది. కానీ రాజకీయంగా ఎదగలేకపోయారని తెలిపారు. ఆర్థిక వెనుకబాటుతో విధి లేని పరిస్థితుల్లో అగ్రకుల నేతల చుట్టూ బీసీలు తిరగాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ధన బలంతో సంబంధం లేకుండా కేవలం నిజాయితీ పరులనే గెలిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాజకీ యాల్లో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.