Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పావిడెన్స్: మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ మరో పోరుకు సిద్ధమైంది. ఎదురొచ్చిన ప్రతి జట్టుపై ఆడుతూపాడుతు విజయాలు సాధిస్తున్న టీమ్ఇండియాకు ఇప్పుడు అసలు పరీక్ష ఎదురుకానుంది. ఓవైపు తొలి టైటిల్ కోసం భారత్ వేట.. మరోవైపు నాలుగోసారి చాంపియన్షిప్ కోసం ఆస్ట్రేలియా ఆరాటం.. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య మరో రసవత్తర పోరాటానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటివరకు ఇరుజట్లు ఆడిన చెరో మూడు మ్యాచ్ల్లో నెగ్గి సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకున్నా.. కీలకమైన నాకౌట్ పోరుకు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలువాలని రెండు జట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో ఫలితాన్ని పక్కనబెడితే.. పోటీ మాత్రం కఠినంగా సాగే అవకాశాలు కనబడుతున్నాయి.