Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా చేస్తానని గొప్పలు చెప్పిన కేసీఆర్.. అది ఇప్పుడు ఏమైందని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి.రాఘవులు ప్రశ్నించారు. ప్రజా సంక్షే మాన్ని గాలికొదిలేసి కుటుంబానికే ప్రాధాన్యత నిచ్చారని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేస్తే కేంద్రంలోని ఎన్డీయేకు వేసినట్టేనన్నారు. కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడి, మాట్లాడే వారినే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ కాంట్రాక్టర్లను బాగు చేసిందనీ, టీడీపీ పెత్తందారీ వ్యవస్థను తీసుకొచ్చిందనీ విమ ర్శించారు. ఇప్పుడు టీఆర్ఎస్ అదే చేస్తోందని ఆవేద న వ్యక్తం చేశారు.