Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నవతెలంగాణ కార్టూన్ ఎడిటర్ పి.నరసింహా(నర్సిం)కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డుతో సత్కరించింది. నేషనల్ ప్రెస్డే సందర్భంగా ప్రతి సంవత్సరం జర్నలిజంలో అత్యుత్తమ సేవలను అందించిన వారికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా గుర్తించి అవార్డులిస్తుంది. అందులో భాగంగా శుక్రవారం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జాతీయ ప్రెస్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మెన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించగా అవార్డుల జ్యూరీ కమిటీకి దేవులపల్లి అమర్ కన్వీనర్గా ఉన్నారు. అవార్డ్ ప్రదానోత్సవం సందర్భంగా జైట్లీ ఃఃడిజిటల్ యుగంలో పాత్రికేయుడి విలువలు-సవాళ్లుఃః అనే పుస్తకాన్ని ఆవిష్కరించాక.. ఆయన మాట్లాడారు. ప్రజాస్వా మ్యంలో మీడియా పాత్ర చాలా కీలకమని వ్యాఖ్యా నించారు. అయితే, ప్రస్తుతం మాత్రం మీడియా పక్షపాత వైఖరి అవలంభిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధమైన ధోరణికి చరమగీతం పాడాల న్నారు. జర్నలిస్టులు విలువలతో పని చేయాలని సూచించారు. దేశ సమస్యలపై స్పందిస్తూ అవార్డులు గెలుచుకున్న వారిని ఆయన అభినందించారు. అనంతరం దేవులపల్లి అమర్ ప్రారంభోపన్యాసం చేశారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.